ఆర్ధిక క్రియాశీలత వ్యయం మరియు ప్రయోజనాలు:

 కేంద్రము మరియు రాష్ట్రాలు

ప్రస్తుతం, భారతదేశంలో రాష్ట్రాల ఆర్ధిక నిర్వహణ మునుపెన్నడూ లేనంతగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెరుగుతున్న ఉచిత పథకాల సంప్రదాయం, అధిక ఋణ స్థాయి, ఉత్పాదకత లేని ప్రయోజనాల కోసం ఋణాలను ఉపయోగించడం, ప్రభుత్వ పధకాలకు నిధుల కోసం బడ్జటేతర ఋణాలను ఉపయోగించడం మరియు FRBM, CAG మరియు మార్కెట్ వంటి సంస్థాగత వైఫల్యాలు  ఆందోళనకరమైనవి. “రాష్ట్ర స్థాయిలో ఆర్థికపరమైన వృధా ఖర్చు అధికం అని పరిగణిస్తే” దాన్ని మెరుగుపరచడానికి సూచనలు ఉన్నాయి. ఈ సూచనలలో కఠినమైన ఆర్ధిక అత్యవసర స్థితి అధికంగా అప్పులు తీసుకున్న రాష్ట్రాలపై విధించటం మరియు ఆర్థిక భాద్యత మరియు బడ్జెట్ నిర్వహణ (FRBM) విధానాలను మెరుగుపరచడం లాంటి షరతులు ఉంటాయి. అయితే, కేంద్ర ప్రభుత్వంలో ఆర్ధిక లాభదాయకత ఖర్చు అధికంగా ఉండవచ్చు. 

పెరుగుతున్న ఆర్ధిక క్రియాశీలత 

ఆర్ధిక క్రియాశీలత, ఉచిత పథకాలు మరియు రాయితీలు రెండూ పెరుగుతున్న కొద్దీ, మరింత సూక్ష్మమైన విధానం అవసరం అవుతుంది. ధనికులకు ఇచ్చే ప్రయోజనాన్ని ప్రోత్సాహకం అనీ, పేదలకు ఇస్తే రాయితీ అని అంటారు. అంతేకాకుండా, ఉచిత పథకాలకు ప్రసిద్ధి చెందిన కొన్ని రాష్ట్రాలు, వృద్ధి మరియు సంక్షేమంలో మెరుగుదలను ప్రదర్శించాయి. తమిళనాడు మధ్యాహ్న భోజన పధకం వంటి ‘ఉచిత పథకాలలో’ కొన్ని పరివర్తనాత్మక జాతీయ పోషకాహార కార్యక్రమాలుగా మారాయి. కాబట్టి అటువంటి చర్యలు మరియు వాటి ఆర్ధిక లాభదాయకతను సాధారణీకరించడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉచిత పథకాలు మరియు రాయితీలను, బడ్జెట్ ద్వారా, బ్యాంక్ؚలతో సహా పబ్లిక్ రంగ సంస్థల ద్వారా పెంచుతున్నాయి అని గమనించడం కూడా ముఖ్యం. కాబట్టి, ఆర్ధిక క్రియాశీలత మరియు లోటు, ఋణం మరియు ఆర్ధిక స్థిరత్వం మీద దాని ప్రభావంపై సమగ్ర వీక్షణ అవసరం.

బడ్జటేతర ఋణాలు

అమలులో ఉన్న బడ్జటేతర ఋణాలు బడ్జెట్ సమగ్రతను తగ్గిస్తాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పదే పదే ఈ తప్పును చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ముందుకెళ్ళే మార్గాన్ని చూపాలి. క్లుప్తంగా, రాష్ట్రాల ఆర్ధిక లాభదాయకత అనేది తీవ్రమైన జాతీయ ఆందోళన. ఈ అంశంపై ప్రత్యేకించి దృష్టి పెట్టడం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్ధిక రంగాల మధ్య ఉన్న క్లిష్టమైన, భయంకరమైన లోపాయకారి ప్రవర్తన నుంచి దారి మళ్లించే వ్యూహంగా పరిగణించబడుతుంది.

సంస్థాగత యంత్రాంగానికి సంబంధించి, చట్టబద్ధమైన నిబంధనలు రాష్ట్రాల కంటే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వానికి నిర్వహణ సామర్ధ్యాన్ని ఇస్తుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండిటిలో పారదర్శకంగా లేని ఆర్ధిక విధానం గురించి సమయానికి వెల్లడించే సంస్థాగత యంత్రాంగం అందుబాటులో లేదు. రాష్ట్ర స్థాయిలో ఆర్ధిక క్రియాశీలత ఖర్చు చాలా ఎక్కువగా ఉండవచ్చు అందువలన సంస్థాగత నిబంధనలను మెరుగుపరచడానికి సూచనలు ఉన్నాయి. నిజానికి, కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక దుబారా ఖర్చు మరింత అధికంగా ఉండవచ్చు.

భారత ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన లేదా సంపూర్ణమైన ఆమోదం లేకుండా రాష్ట్రాలు బడ్జటేతర ఋణాలని తీసుకోవడం అనేది ఊహించలేనిది. ప్రత్యేకించి, రాష్ట్రాలు తీసుకునే బడ్జటేతర ఋణాలలో అధిక భాగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రసిద్ధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ ఆర్ధిక సంస్థల నుంచి మరియు NABARD వంటి అభివృద్ధి ఆర్ధిక సంస్థల నుంచి తీసుకుంటున్నారని చూపడానికి బలమైన రుజువులు ఉన్నాయి. ఈ సంస్థలు, ప్రత్యేకించి బ్యాంకులు, బడ్జటేతర ఋణాలకు మద్దతు ఇవ్వడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ ఆర్ధిక సంస్థలు చాలా ఎక్కువ వడ్డీ రేట్లను విధించి లాభాలను గడిస్తున్నాయని కూడా విశ్వసిస్తున్నారు.

చివరిగా, కేంద్రం మరియు రాష్ట్రాలు తీసుకునే బడ్జటేతర ఋణాలు, ఆర్ధిక బాధ్యత చట్టాలు విధించే నిబంధనలను తగ్గిస్తాయి. ఈ పద్ధతి, ఆర్ధిక వ్యవహారాలలో పారదర్శకత లేకపోవడానికి కూడా దారి తీస్తుంది.  ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ఆర్ధిక సంస్థల ప్రమేయం ఉండే అంతర్గత-ప్రభుత్వ రంగ లావాదేవీల లూప్ؚను సృష్టించింది. దీన్ని తొలగించకపోతే, ఆర్ధిక వ్యవస్థకు ప్రభుత్వ రంగాల నుండి హాని పెరగడం కొనసాగుతుంది మరియు ఆర్ధిక ప్రమాదాలను ఇంకా పెంచుతుంది. 

ఆర్ధిక భద్రత: సమరూప విధానం 

స్థూల ఆర్ధిక స్థిరత్వానికి ఆర్ధిక భద్రత అనేది అత్యవసరమైనది అనడంలో భిన్నాభిప్రాయాలు లేవు మరియు ఇటీవలి సంవత్సరాలలో వచ్చిన మహమ్మారి మరియు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సృష్టించిన ప్రపంచవ్యాప్త ప్రతికూలతల వలన దీని ప్రాముఖ్యత ఎన్నో రెట్లు పెరిగింది. భారతదేశంలో, GDPకి (కేంద్రము+రాష్ట్రాలు) ఉమ్మడి ఋణం, GDPలో దాదాపు 90 శాతం స్థాయికి చేరుకుంది. ఈ పెరుగుదలను చూస్తే, స్థూల స్థిరత్వాన్ని నిర్ధారించడానికి సాధారణ ప్రభుత్వ ఋణం మరియు లోటును తగ్గించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. వడ్డీ ఖర్చులను తగ్గించడానికి మరియు ముఖ్యమైన, అవసరమైన వ్యయాల కోసం మరింత ఎక్కువ అవకాశాలను సృష్టించడం కోసం ఋణాలను తగ్గించడం చాలా కీలకం. కానీ వివరాలను కలిగి ఉండటం ముఖ్యం.  మహమ్మారికి ముందు, తరువాత లోటు స్థాయిలను పోల్చి చూస్తే, 2019-20లో GDP నిష్పత్తిలో ఉమ్మడి లోటు 8.3 శాతంగా ఉంది, రాష్ట్రాలకు ఇది 3.6 శాతంగా ఉంది. 2020-21 సంవత్సరంలో, కేంద్ర ప్రభుత్వ GDP నిష్పత్తిలో లోటు 9.2 శాతానికి పెరిగింది. అదే సంవత్సరానికి రాష్ట్రాల లోటు GDPలో 4.1 శాతంగా ఉంది. 2020-21 సంవత్సరంలో, కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ లోటు అత్యధికంగా GDPలో 7.3 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ లోటు 1979-80లో ప్రారంభం అయింది, అప్పటి నుంచి కొనసాగుతూ పరిమాణంలో పెరుగుతూ వచ్చింది. 1979-80లో రెవెన్యూ లోటు మొత్తం రూ. 694 కోట్లు. 2022-23 (BE) ప్రకారం, కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ లోటు రూ. 10 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉందని అంచనా, ఇది GDPలో 3.8 శాతంగా ఉంది.

2020-21 సంవత్సరంలో, రాష్ట్ర రెవెన్యూ లోటు GDPలో 1.9 శాతంగా ఉంది.  సాధారణ ప్రభుత్వ మూలధన వ్యయం యొక్క ప్రధాన చోదకులుగా రాష్ట్రాలు కూడా ఉన్నాయని గమనించడం ముఖ్యం. మహమ్మారి తారాస్థాయిలో ఉన్నప్పుడు, ఉమ్మడి మూలధన వ్యయంలో, రాష్ట్రాల మూలధన వ్యయం వాటా సుమారు 56 శాతంగా మరియు GDPలో 2 శాతంగా ఉంది. ఆర్ధిక నిర్వహణ విషయంలో, 2005లో ఆర్ధిక బాధ్యత చట్టం (FRL) తర్వాత, చాలా సంవత్సరాలు మొత్తం రాష్ట్ర-స్థాయి లోట్లు, FRL ఏర్పరచిన లక్ష్యాలలోనే ఉన్నాయి. రాష్ట్రాల సంయుక్త రెవెన్యూ ఖాతా లో ఖర్చు కంటే కొంత వరకు ఆదాయం ఎక్కువగా వుంది, ఇది ఈ సమయంలో మూలధనాన్ని అధికంగా వెచ్చించడానికి ఆర్ధిక అవకాశాలను మెరుగుపరచడంలో సహాయపడింది. అయితే, స్థూల ఆర్ధిక మందగమనం మరియు మహమ్మారిల కారణంగా, చాలా రాష్ట్రాలు రెవెన్యూ లోటులలో కూరుకుపోయాయి. 2017-18లో, రాష్ట్రాల రెవెన్యూ లోటు GDPలో 0.2 శాతంగా ఉంది, ఇది 2020-21 సంవత్సరానికి మహమ్మారి కారణంగా GDPలో 1.9  శాతానికి పెరిగింది మరియు 2022-23 (BE)లో GDPలో 0.3శాతానికి పెరుగుతుందని అంచనా. ఈ ధోరణిని వేగంగా తిరోగమనానికి తీసుకువెళ్లడం ముఖ్యం.

చివరిగా, ఆర్ధిక అసమతుల్యత అనేది కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఆర్ధిక సవాళ్లను కేంద్ర మరియు రాష్ట్రాల ఉమ్మడి బాధ్యతగా చూస్తే తప్ప ఏకీకరణను సాధించలేము. 2020-21 తరువాత, కేంద్ర స్థాయిలో గణనీయమైన ఆర్ధిక సవరణలు జరిగాయి, ఇది తాజా 2023-24 బడ్జెట్ؚలో అందించిన ఆర్ధిక లోటు గణాంకాలను బట్టి స్పష్టమైంది. 2021-22 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ లోటు గణనీయంగా తగ్గింది మరియు 2022-23 (RE)లో ఇది 6.4 శాతంగా ఉంది, 2023-24 BEలో 5.9 శాతం ఉంటుందని అంచనా.

అయితే, కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వాల విధానం మరియు విభిన్నమైన ఆర్ధిక దిద్దుబాటు మార్గాల పరంగా సమరూప ధృక్పధం మాత్రమే సాధారణ ప్రభుత్వ లోటును స్థిరమైన స్థాయికి తగ్గించగలదు.